Telugu Fast News
Telugu Fast News
Saturday, 20 Apr 2024 18:30 pm
Telugu Fast News

Telugu Fast News

Telugu Fast News: దక్షిణ మధ్య రైల్వే సంస్థ పరిధిలో(SCR) రైల్వే ట్రాక్‌ మరమ్మతుల పనుల్లో భాగంగా ఖమ్మం రైల్వేస్టేషన్‌(Khammam Railway Station) మీదుగా వెళ్లే పలు ప్యాసింజర్‌ రైళ్లను ఈనెల 22 నుంచి మే 26 వరకు  రద్దు చేస్తున్నట్లు ఖమ్మం రైల్వే చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎండీ.జాఫర్‌  తెలిపారు.

ఆదిలాబాద్‌-తిరుపతి(కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ 17405, 17406) రైలును దారి మళ్లించినట్లు పేర్కొన్నారు. పలు తేదీల్లో ఖమ్మం రైల్వేస్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆగదని పేర్కొన్నారు. వయా విజయవాడ, గుంటూరు, పగడిపల్లి రైల్వేస్టేషన్ల మీదుగా వెళుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్తించి రైల్వే ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. కొద్ది నెలల క్రితమే ప్యాసింజర్‌ రైళ్లను రైల్వే అధికారులు పునరుద్ధరించగా.. మళ్లీ నెల రోజుల పాటు రద్దు చేయనున్నారు.
రద్దైన రైళ్లు వివరాలు ఇలా..
07755 డోర్నకల్​–విజయవాడ
07756 విజయవాడ– డోర్నకల్​
07278 భద్రాచలం రోడ్​(కొత్తగూడెం)–విజయవాడ
07979 విజయవాడ-–భద్రాచలం రోడ్​