అఫ్గానిస్థాన్‌పై (Afghanistan) పాకిస్థాన్‌ మెరుపు దాడులకు పాల్పడుతోంది. పాకిస్థాన్​ (Pakistan) చేసిన వైమానిక దాడుల్లో మొత్తం 46 మంది మృతిచెందినట్లు అఫ్గాన్​లోని తాలిబన్‌ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని.. ప్రతీకారం తీర్చుకుంటామనిహెచ్చరించింది.

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు (Taliban) ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశల మధ్య ఉన్న సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమణల సమయంలో అనేక మంది తమ దేశస్తులను తాలిబన్లు చంపేశారని పాక్​ ఆరోపించింది. ఇటీవల కూడా పాకిస్థాన్​లో (Pakistan) జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మార్చిలో అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేసిన పాక్‌.. తాజాగా మరోసారి దాడులకు పాల్పడింది.

అఫ్గాన్​లోని తూర్పు పక్తికా ప్రావిన్స్‌ లో ఉన్న బార్మల్‌ జిల్లాలోని నాలుగు గ్రామాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్లు తెలుస్తోంది (Pakistan attack on Afghanistan). ఈ దాడుల్లో 46 మంది చనిపోయారని, మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి సీరియస్​గా ఉందని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ వెల్లడించారు. ఈ దాడులు ఓ అనాగరిక చర్య అని తాలిబన్‌ రక్షణశాఖ పేర్కొంది. వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది.