Nizamabad:పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం! అసలేం జరిగిందంటే?
Nizamabad:పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం! అసలేం జరిగిందంటే?
- By --
- Saturday, 20 Apr, 2024
నిజామాబాద్:పూడ్చిపెట్టిన మృతదేహానికి కొల్లూర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండలంలోని సాటాపూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన గీరయ్య(48) బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాడు. అక్కడ భవన నిర్మా ణ కార్మికుడిగా పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు పనిచేస్తున్న ప్రదేశంలో భవనంపై నుంచి కిందపడ్డాడు.
ఈ ఘటనపై సైబరాబద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూర్ పీఎస్లో కేసు నమోదైంది. గాయపడిన గీరయ్యను కుటుంబీకులు గ్రామానికి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందించారు. ఇంటి వద్ద చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతిచెందాడు. కుటుంబీకులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కొల్లూర్ పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకొని కేసు విషయమై పూడ్చిపెట్టిన మృతదేహానికి డాక్లర్లు, ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించారు.