christian:నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఏర్పాటు
christian:నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఏర్పాటు
- By --
- Tuesday, 23 Apr, 2024
Telugu Fast News:రామంతాపూర్లో మౌంట్ జీయోన్ చర్చిలో క్రైస్తవుల సమస్యలు, పాస్టర్లపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక సమావేశాన్ని పాస్టర్ ప్రకాష్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు పలు తీర్మాణాలు చేశారు. ప్రధానంగా నేషనల్ చర్చెస్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం ద్వారా క్రైస్తవల కోసం ప్రత్యేక ఫోరం నెలకొల్పడం జరిగిందన్నారు. దాడులు జరిగిన ప్రాంతానికి సంఘం సభ్యులు వెళ్లి బాధితులను ఓదార్చడంతోపాటు వారికి అవసరమైన ఆర్థికసాయాన్ని అందజేయాలని తీర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. పాస్టర్లుపై జరిగే దాడులపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో బ్రదర్ బాబురావు, పాస్టర్స్ అనీల్, స్టివెన్ డేనియల్రెడ్డి, సత్యం, బిషప్ దయానంద్ పాల్గొన్నారు.