12 (1)

Ragidi: పాతికేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నా..ఆరు గ్యారంటీ సర్కారునే బొంద  పెట్టుడే

Ragidi: ఒక్క అవకాశం ఇవ్వండి..మల్కాజ్​గిరి అభివృద్ధి చేసి చూపిస్తా!

Uppal: పాతికేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసిన నాయకుడి కేసీఆర్​ మల్కాజ్​గిరి నుంచి పోటీ చేసే అవకాశం నాకు కల్పించారు. మల్కాజ్​గిరి ప్రజల కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆపార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోరారు.

ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్​ పార్టీ బొంద పెట్టాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఎన్నుకున్న నాయకుడు మన ఉప్పల్​ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Banadari Laxmareddy)  జనం మధ్యలో సామన్యుడిగా ఉన్నారన్నారు. మల్కాజ్​గిరి ప్రజల ఓట్లుతో ఎన్నికైన రేవంత్​రెడ్డి (CM Reventh Reddy)మాత్రం నేడు సీఎం అయ్యాడు తప్ప..ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. 

కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మల్కాజిగిరి లో ఓటు హక్కు  అడిగే అర్హత లేదన్నారు. మల్కాజిగిరి ప్రజలారా ఆలోచించండి.. ఆగం కాకండి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మల్కాజ్​గిరి పార్లమెంట్​ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.  మీ అందరికీ అందుబాటులో ఉంటా కారు గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధి చేసుకుందాం అని కోరారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, సంతోష్, అరటికాయల భాస్కర్, మస్క భాస్కర్ జనరల్ సెక్రెటరీ,మేకల హనుమంత్ రెడ్డి, ఆకుల మహేందర్ రెడ్డి,మోషం శీను, రాజ వర్ధన్ గుప్తా, కొండ్రు హనుమంతు, అనిత రెడ్డి మహిళా అధ్యక్షురాలు, రాణి రెడ్డి,జితేందర్ రెడ్డి, జినాద్ బేగం,ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ  సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 


Comment As:

Comment (0)