kakinada

Kakinada: పెళ్లి పందిట్లో దారుణం.. పురోహితుడికి ఘోర అవమానం!

Kakinada: పెళ్లి పందిట్లో దారుణం.. పురోహితుడికి ఘోర అవమానం!

Telugu Fast News: పెళ్లి మండపంలోనే పురోహితుడికి ఘోర అవమానం జరిగిన ఘటన చోట చేసుకుంది.  పెళ్లి తంతులో మంత్రాలు చదువుతున్న పూజారి శర్మ తలపై సంచులు కప్పడం, కుంకుమ, పసుపు, నీళ్లు చల్లుతూ ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏపీ కాకినాడకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలోని యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామ శివాలయంలో ఈ నెల 12న ఓ వివాహం జరిగింది. ఆ మ్యారేజ్ జరిపించడానికి అదే గ్రామానికి చెందిన పూజారి ఆచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ వెళ్లగా.. అక్కడ కొంతమంది ఆకతాయిలు దుశ్చర్యకు పాల్పడ్డారు. శర్మ తలపై సంచి కప్పడం, పసుపు, కుంకుమ, వాటర్‌ చల్లడంతో పాటు ఇతర సామగ్రి విసిరారు. ఇదంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్ అయింది. దీంతో బ్రాహ్మణ, విశ్వహిందూ పరిషత్తు సంఘాలు మండిపడ్డాయి.

AP: పెళ్లి పందిట్లో ఓ పురోహితుడిని ఆకతాయిలు ఆటపట్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దంపతులను ఆశీర్వదిస్తూ వేద మంత్రాలు చదువుతున్న పూజారిపై కొంతమంది కుర్రాళ్లు కావాలనే దుశ్చర్యకు పాల్పడ్డారు. పూజలో నిమగ్నమైన పూజరి నెత్తిపై సంచులు కప్పడం, దుస్తులు విసరడం చేస్తూ దారుణంగా ప్రవర్తించారు. దీనిపై హిందువులు, పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.
బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి నిందుతులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆకతాయిల పనికి చాలా బాధపడ్డాను. దీనిపై విశ్వహిందూ పరిషత్‌ సంఘాలతో చర్చించి దీనిపై ఏ నిర్ణయం తీసుకువాలో చెబుతాను. పోలీసులు ఈ ఇష్యూపై పెద్దగా స్పందిచలేదని పూజారి శర్మ వాపోయాడు.
 


Comment As:

Comment (0)