Andhra Pradesh: సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు
Andhra Pradesh: సొంత తల్లిని కత్తితో పొడిచి చంపిన కొడుకు
- By --
- Saturday, 20 Apr, 2024
ఏపీలోని ఎన్టీఆర్(NTR Distric) జిల్లా నందిగామ (Nandhigama)మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
తల్లి ఉమమహేశ్వరి కొడుకుని మందలించేది. దీంతో ఇరువురి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఆస్తి తనకు పంచివ్వాలంటూ కొడుకు సురేష్ తల్లితో వాదించాడు. కానీ ఇందుకు అతడి తల్లి ఒప్పుకోలేదు. చివరికి కోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై విచారించిన న్యాయస్థానం కొడుకుకు నోటీసులు పంపించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్.. తల్లిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ మధ్య కాలంలో కుటుంబ హత్యలు చాలా జరుగుతున్నాయి. భార్య-భర్తలు, తండ్రి-కొడుకు, తల్లి-కొడుకులు ఇలా ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలో నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లిని సొంత కొడుకే కత్తితో విచక్షణారహితంగా హత్య చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మాగంటి ఉమమహేశ్వరి ఆమె కొడుకు మాగంటి సురేష్ గ్రామంలో ఉంటున్నారు. అయితే సురేష్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.